చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ
సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం
పల్లవి:
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
చరణం:
వీర రక్తపుధార, వారవోసిన సీమ -2
పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా ఆ.. -2
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ గూడ నీవోడోయ్
చరణం:
నాయకి నాగమ్మ, మల్లమాంబా, మొల్ల -2
మగువ మాంచాల నీతోడ బుట్టినవోళ్ళే -2
వీరవనితలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా!
చరణం:
కల్లోల గౌతమీ....ఆ..ఆ..
వెల్లువల కృష్ణమ్మ..ఆ..ఆ..
కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి, పొంగి బారిన చాలు -2
ధాన్యరాశులె పండు దేశానా!
కూడు గుడ్డకు కొదువ లేదోయీ
చరణం:
ముక్కోటి బలగమోయ్, ఒక్కటై మనముంటే..ఏ..
ఇరుగు పొరుగులోన, వూరు పేరుంటాది -2
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా!
చరణం:
పెనుగాలి వీచింది..ఆ..ఆ..
అణగారి పోయింది..ఆ..ఆ..
పెనుగాలి వీచింది – అణగారి పోయింది
నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది -2
చుక్కాని పట్టరా తెలుగోడా!..ఆ..
నావ దరిజేర్చరా – మొనగాడా!
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!..ఆ.